TRINETHRAM NEWS

Fatal road accident in Anantapur district: Four youths killed

Trinethram News : అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, పుట్టినరోజు వేడుకలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది,

ఈ ఘటనలో నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఒక్క ఘటన నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది..

చనిపోయిన నలుగురు యువకులు అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందా?లేక యువకులే మద్యం సేవించి కారు నడిపారా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident in Anantapur district: Four youths killed