WhatsApp Image 2024 08 26 at 3.25.31 PM
Flooded Godavari in Maharashtra.. Sunken temples
Trinethram News : Maharashtra : మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
