కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు ఏ విద్య సాగర్ ఏపీ జేఏసీ పిలుపు మేరకు అన్నీ కార్యాలయాల్లో అన్నీ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జ్ ల తో నిరసన తెలియజేతున్నాం.

రేపు ఎల్లుండు తాలుక కేంద్రాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలియజేస్తాం. అన్నీ ప్రభ్యత్వ కార్యాలయాలనుండి అందరూ నల్ల బ్యాడ్జ్ లు ధరించారు.

ఆరు DA బకాయిలు పెండిగులు ఉంచారు.. 6 నుండి 7 వేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి… రిటైర్ ఐతే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు…TA DA లు ఇప్పటివరకు ఇవ్వలేదు… మేము ప్రజల్లో భాగం కాదా?

కరోనా సమయం లో అర్ధం చేసుకుని వెనక్కి తగ్గాము.. గతం లో సెప్టెంబర్ 30 లోగ మా డిమాండ్లను నెరవేరుస్తాము అన్నారు… లోన్ పెట్టుకోవడానికి లేని పరిస్థితి రాష్ట్రం లో ఉంది.

పోర్టల్ ను కూడా క్లోజ్ చేసారు.. పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇప్పటికే నిరసన తెలియజేస్తున్నారు.. 27 న చలో విజయవాడ కు అందరూ సిద్ధం గా ఉన్నరూ…

You cannot copy content of this page

Scroll to Top