
Yanamalla Anita Elected Secretary : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 19 త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎన్నికలలో ఈసీ మెంబర్లు పాల్గొని ఓట్లు వేయడం జరిగింది ఆ ఎన్నికల్లో డిండి మండలం తవకలాపూర్ గ్రామానికి చెందిన యనమల్ల అనిత కార్యదర్శిగా గెలుపొందిందని అధికారులు ప్రకటించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పిడి శేఖర్ రెడ్డి శాలువాతో అనితను సన్మానించారు.అనిత మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ఈసీ మెంబర్ లకి మరియు నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.మహిళా సంఘాల అభివృద్ధికి మరింత బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా ఆమె అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe