ఆగస్ట్ 22, 2026
TRINETHRAM NEWS
Bandaru Mahesh

Bandaru Mahesh : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. ఈరోజు ములకలపల్లి మండలం లో గ్రామ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుతో పరిచయ కార్యక్రమంలో, అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్, మాట్లాడుతూ, కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న,సంక్షేమ పథకాలు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం.

కరెంట్ 200 యూనిట్లు కంటే తక్కువ గా విద్యుత్ వాడకం ఉంటే జీరో కరెంట్ బిల్లు పథకం ఎర్పాటు వంటివి.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను ఇవ్వడం.గత 10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇవ్వలేని, హరుహులైనా పేదలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం.

కొత్త పెన్షన్లు, రైతు రుణమాఫీ,రైతు బంధు వంటి కార్యక్రమాలపై ప్రతి మనిషికి అవగాహన కల్పించాలని ప్రతి సేవాదళ్ అధ్యక్షుడు క్రమశిక్షణగా వుండాలని కాంగ్రెస్ పార్టీ నీ ముందుండి నడిపించాలని అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మేజర్ సర్పంచ్ కోర్స్ చంద్రలేఖ, ములకలపల్లి సేవాదళ్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి,దమ్మపేట సేవాదళ్ అధ్యక్షులు అయ్యప్ప, జనరల్ సెక్రెటరీ అవినాష్, రాంబాబు,రాజేష్,నాగబాబు,ఇంకా కొంత మంది సేవాదళ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page