TRINETHRAM NEWS

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు. ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలో కస్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ ని గెలుపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.