Shirdi Sai Baba : షిరిడి సాయిబాబా ఆలయం 20వ వార్షికోత్సవం, బాబా ని దర్శించుకున్న అనపర్తి,మాజీ ఎమ్మెల్యే దంపతులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన సాయిబాబా గుడి 20వ వార్షికోత్సవం కార్యక్రమానికి హాజరై సాయిబాబా వారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులను సన్మానించారు.

వీరి వెంట కమిటీ చైర్మన్ ఎస్ .వి .కే పురుషోత్తం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరెడ్డి, పడాల వెంకటరెడ్డి(మిఠాయి), సత్తి శ్రీనివాసరెడ్డి(ఎల్ ఐ సి ), కోనాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, గుడిమెట్ల విశ్వనాథ్, కర్రి దుర్గరెడ్డి, కర్రి అచ్చిరెడ్డి తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shirdi Sai Baba Temple

You cannot copy content of this page

Scroll to Top