TRINETHRAM NEWS

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమంటే
విశ్వసనీయతకు మారు పేరు

  • సీఎం వైఎస్ జగన్

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్
వీడియో కాన్ఫరెన్స్

జనవరిలో 3, ఫిబ్రవరిలో
ఒక కార్యక్రమం చేస్తున్నాం

జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక
రూ.3 వేలకు పెంపు

జనవరి 1 నుంచి 8 వరకు
పెన్షన్ల పెంపు కార్యక్రమం

గత ప్రభుత్వంలో పింఛన్
రూ.1000 మాత్రమే ఇచ్చేవారు

వైఎస్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక
పింఛన్ రూ.2,250

ఇప్పుడు పింఛన్ రూ.3 వేల వరకూ..
పెంచుకుంటూ వచ్చాం

జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని
ఆవిష్కరిస్తున్నాం

జనవరి 23 నుంచి 31 వరకు
ఆసరా కార్యక్రమం

వైఎస్ఆర్‌ చేయూత కార్యక్రమం
ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు

అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే..
వారికి పథకాలు వర్తింప చేసే
బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది

66,34,742 మందికి..
రూ.1968 కోట్లకు పైగా పింఛన్ల రూపంలో అందుతాయి

పింఛన్‌ల పెంపు కార్యక్రమంలో
నేను 3వ తారీఖున
కాకినాడలో పాల్గొంటాను

ఎమ్మెల్యే ప్రతి మండలంలో
పింఛన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొనాలి

8 రోజులపాటు పెంచిన పింఛన్లతో..
పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది

అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే
ప్రభుత్వం మనది

ఆసరా కోసమే
రూ.25,570 కోట్లు వెచ్చించాం

మూడు విడతలుగా ఇప్పటికే
రూ.19,95 కోట్లు ఇచ్చాం

చివరి విడతగా
రూ.6,394 కోట్లు ఇస్తున్నాం

జనవరి 23 నుంచి
31వ తారీఖు వరకూ
ఈ కార్యక్రమం జరుగుతుంది

ఈ కార్యక్రమం ద్వారా
78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారు

పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల
విజయగాథలను వీడియో రూపంలో పంపాలి

పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి
బహుమతులు

సచివాలయ స్థాయిలో రూ.10 వేలు,
మండలస్థాయిలో రూ.15 వేలు,
నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు,
జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతులు

ఫిబ్రవరి 15 -16 తేదీల్లోనే..
వలంటీర్లు ఉత్తమ సేవలు అందించినందుకు..
సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు

ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ
వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం

ఇప్పటి వరకూ
రూ.14, 129 కోట్లు ఇచ్చాం

ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో..
45 ఏళ్లు పైబడి ఉన్న మహిళలకు..
ఏడాదికి రూ.18,750 ఇచ్చాం

యూనిక్ లబ్ధిదారులు
31,23,466 మంది ఉన్నారు

ఈ పథకం వారి జీవితాల్లో
ఎటువంటి మార్పు తెచ్చిందో చెప్పాలి

చివరి విడత ద్వారా
26,39,703 మంది లబ్ధి పొందుతున్నారు