TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ. వైసీపీ నాయకుడు గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర నాయక్ (Gvs) విజయవాడలో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ రెడ్డి సీఎంగా పని చేసినప్పుడు శంకర్ నాయక్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. తాజాగా శంకర్ నాయక్ ఇలా వ్యభిచారం కేసులో పట్టు పడటంతో ఇదా రాజకీయం అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు.

రాజకీయ నాయకుల పేరుతో సంఘ విద్రోహశక్తులు చేస్తున్న ఇలాంటి నేరాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. శంకర నాయక్ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తాజా ఉదాహరణగా చెబుతున్నారు. విజయవాడలో మసాజ్ సెంటర్ లో ఉత్తరాది యువతితో వ్యభిచారం చేస్తున్న సమయంలో పోలీసులు రావడంతో అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్న వైసీపీ నాయకుడు శంకర్ ను అతి కష్టం మీద పోలీసులు పట్టుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shankar Naik