TRINETHRAM NEWS

While taking a selfie, the locals who worked hard to save the Kalujari canal.

Trinethram News : నల్గొండ : ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది ఓ మహిళ. వెంటనే స్థానికులు స్పందించి ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ సరదగా చుద్దామని.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ తన భర్త, తమ్ముడు, కూతురు తో కలిసి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు మహిళ కాలు జారి కాలువలో పడింది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ మహిళను కాపాడారు. ఆమెను కాపాడేందుకు దాదాపుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డారు.మహిళను ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు,స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు. కాగా సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చాలా మంది తమ ప్రాణాలను పోగోట్టుకున్న సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

While taking a selfie, the locals who worked hard to save the Kalujari canal.