
అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్. మార్చి 1: ఇక డోలి రహిత ఏజెన్సీ నీ చూడబోతారు ఆని, నాయకుల అధికారులు చెప్పినా హామీలు అమలు అయ్యేల కనిపించడం లేధు.. వివరాల్లోకి వెళితే అరకులోయ మండల కేంద్రం, మడగడ పంచాయితీ, మెచ్చగూడ, తదితర గ్రామాల్లో సరి అయిన రహదారి సౌకర్యం లేక గిరిజనులు డోలినే నమ్ముకున్నారు. ఆని వారి బాధలు త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్ తొ పంచుకున్నారు.
స్థానిక యువ నాయకుడూ సమర్థి రాంచందర్ మాట్లాడుతు, మా ఆదివాసి ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో రహదారి సౌకర్యం లేక, వైద్యం కోసం డోలీమోతలు తప్పని దుస్థితిలో గిరిజన ప్రజల బతుకులు ఉన్నాయి,వాటి కొరకు నిధులు మంజూరు చేయలి అని పేర్కొన్నారు.
ఆదివాసి ప్రాంతంలో 1/70 చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి చట్టాలు పటిష్టంగా అమలుపరిచి,విద్య,వైద్యం,యువతకు ఉపాధి అవకాశాలు, మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలి అని గ్రామస్తులైనటువంటి, సన్యాసిరావు, వంతల కామరాజు, చందర్ బంగార్రాజు, అప్పలరాజు, ఫీసా కమిటీ ప్రెసిడెంట్ పాంగిరాజు,వారి బాధను వెల్లబుచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
