TRINETHRAM NEWS

పుల్లలచెరువు మండలం లో ఇద్దరు అరెస్టు

పుల్లలచెరువు మండలం నరజాముల తాండలో నాటు సార తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎర్రగొండపాలెం ఎస్.ఐ ఎమ్. వి. రాజేష్ తెలిపారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం నేరమని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరిని మార్కాపురం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో నాటు సారా తయారు చేసిన, అక్రమంగా మద్యం అమ్మితే సమాచారం ఇవ్వాలన్నారు.