TRINETHRAM NEWS

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు

నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు. 30 ఎక్స్​ప్రెస్​, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్​ అండ్​ సీటర్​ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఎండీ సజ్జనార్ చెప్పారు. అందులో 500హైదరాబాద్​కు మరో 500 బస్సులు జిల్లాలో తిరగనున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి 20రోజుల్లో రోజుకు 30లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు.