TRINETHRAM NEWS

నేడే దుబాయిలో ఐపీఎల్ వేలం పాట

ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మినీ వేలం పాట ఈ రోజు దుబాయ్ లో జరగనుంది.

ఈ మినీ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ లోని కోకా కోలా అరీనా వేదికగా జరుగుతుంది. మొదటి సారి ఐపీఎల్ వేలంపాటను విదేశాల్లో జరుపుతున్నారు. అలాగే తొలిసారిగా మహిళా ఆక్షనీర్ వేలం పాట నిర్వహించనున్నారు.

ఈ వేలం పాటలో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు వున్నారు. అత్యధికంగా గుజరాత్ టైటన్స్ వద్ద రిజర్వ్ 38.14 కోట్ల రూపాయలు వున్నాయి.