TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు {డిసెంబర్ / – 30}

చారిత్రక సంఘటనలు

1906: భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.

1922: రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గాఏర్పడ్డాయి.

1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.

1985: తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.

2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.

2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.

2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.

జననాలు

1865: రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936)

1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది “మౌనము” లేదా “మౌనముద్ర”. వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు

1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు

1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,

1935: మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు.

1948: సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్.

1968: సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు.

1984: లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు.

మరణాలు

1955: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895)

1971: విక్రం సారాభాయ్‌, శాస్త్రవేత్త.

1973: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.

1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.

2006: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918)‌‌