TRINETHRAM NEWS

సంఘటనలు

1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.

1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)

2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.


జననాలు

1899: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1986)

1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)

1933: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.

1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)

1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.

1956: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.

1956: బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.

1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది