TRINETHRAM NEWS

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం..

పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రైతు వెన్న పెద్ద వెంకటేశ్వర రెడ్డి పొగాకు బ్యార్ని అగ్నికి ఆహుతి అయింది. అదును సమయంలో పంటను ఇంటికి తీసుకొచ్చి బేరని కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుని బ్యారని లో గల ఆకు మొత్తం బూడిద పాలైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 4 లక్షల వరకు నష్టం జరిగినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బోర్డు వారి సహకరించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా రైతు కోరారు. సంవత్సరం పొడవునా పెట్టుబడి పెట్టి, కష్టపడి చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.