TRINETHRAM NEWS

చిరు వ్యాపారికి చేయూత అందించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో మండుటెండలో చిరు వ్యాపారం నిర్వహిస్తున్న వృద్ధ మహిళకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఆ వృద్ద మహిళకు గొడుగును బహుకరించడమే కాక, ఖర్చులకు గాను యువజన నాయకులు ఎండీ.నాజీమ్ ఆర్థిక సహాయం అందజేశారు..

ఈ సందర్భంలో వృద్ధ మహిళ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ ఎండి ముస్తఫా, మైనారిటీ కార్పోరేషన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, లీగల్ సెల్ నాయకులు కొప్పుల శంకర్, సీనియర్ నాయకులు నాయిని ఓదెలు, అల్లి శంకర్, అబ్బాస్, హమీద్ & తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App