TRINETHRAM NEWS

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో లేబర్ చట్టాల నుంచి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ను రద్దు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రం లో సంస్థలను ప్రోత్సహించేటందుకు ఈ మినహాయింపు 2014 నుంచీ అమలు చేయటం జరిగింది. కానీ అకారణంగా ఉద్యోగులను తొలగించటం, లైంగిక వేధింపులు, పని ఒత్తిడి మొదలైన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర లేబర్ శాఖ వెల్లడించింది.