TRINETHRAM NEWS

The Chief Minister’s London tour has ended – a warm welcome for Jagan who came to the state

Trinethram News : ఎన్నికల అనంతరం ఫ్యామిలీతో లండన్, న్యూజిలాండ్ యాత్రకు వెళ్లిన సీఎం జగన్ ఈ ఉదయం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కాసేపట్లో కౌంటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్‌ పర్యటన నిన్నటితో ముగిసింది. ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్న వైసీపీ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 15 రోజుల పాటు లండన్‌లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం స్వాగతం పలికింది.

రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్, గన్నవరం విమానాశ్రయంలో వైకాపా శ్రేణుల ఘన స్వాగతం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Chief Minister's London tour has ended - a warm welcome for Jagan who came to the state