TRINETHRAM NEWS

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఎమ్మెల్సీ శంభీపూర్

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ సమస్యలను సంబందించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పాటు పడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.