TRINETHRAM NEWS

Tet twice a year from now on

Trinethram News : Telangana : టెట్​(టీచర్స్​ ఎలిజిబిలిటీ టెస్ట్​)ను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్​లో ఒకసారి, డిసెంబర్​లో రెండోసారి టెట్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారులకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)–2009 కింద టెట్​ను రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అందుకు అనుగుణంగా 2015 డిసెంబర్​ 23న విడుదల చేసిన జీవో 36కు సవరణలు చేయాల్సిందిగా స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్, టెట్​ చైర్​పర్సన్, ఎస్​ఈఆర్​టీ డైరెక్టర్​ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. అభ్యర్థులు టెట్​ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చని, అటెంప్ట్స్​పై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. టెట్​లో క్వాలిఫై అయినా స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tet twice a year from now on

Tet twice a year from now on