Trinethram News : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని కోదాడ నియోజకవర్గ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్(TPTF) అధ్యక్షులు రాంపల్లి రాంబాబు డిమాండ్ చేశారు. ఇంతకుముందు నిర్వహించిన టెట్ కు రెండు పేపర్లకు కలిపి 400 రూపాయలు ఫీజు ఉండగా, ఇప్పుడు పేపర్ కి వెయ్యి రూపాయల చొప్పున రెండు పేపర్లకు కలిపి రెండు వేల రూపాయల అధిక ఫీజును పెంచడం నిరుద్యోగుల పైన,వారి కుటుంబం పైన మోయలేని ఆర్థిక భారం పడుతుందని వారు తెలిపారు. నిరుద్యోగులు సొంత ఇంటికి దూరంగా ఉంటూ, పట్టణాలలో ప్రభుత్వ నౌకరి కోసం సన్నద్ధమవుతూ ,పెట్రోల్ బంకులలో, స్విగ్గి ,జొమాటో, రాపిడో,వంటి దొరికిన చిన్న చిన్న పనులను చేస్తూ ఒక పూట తిని, మరో పూట పస్తులు ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వెంటనే టెట్ దరఖాస్తు ఫీజులను తగ్గించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
టెట్ దరఖాస్తు ఫీజులను వెంటనే తగ్గించాలి
Related Posts
Amavasya : అమావాస్య సందర్బంగా
TRINETHRAM NEWS On the occasion of Amavasya ఈరోజు అమావాస్య సందర్బంగా జెడిమెట్ల దుర్గా గుడి దగ్గర గాంధీ విగ్రహం ప్రక్కన శ్రీ వాసవి సేవాదళ్ సుచిత్ర, కొంపల్లి ఆధ్వర్యంలో 800 మందికి మహా అన్నప్రసాదము ఏర్పాటు చేయడము జరిగినది.…
Mahatma Gandhi : మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా
TRINETHRAM NEWS On the occasion of Mahatma Gandhi’s birth anniversary Trinethram News : ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా వెంకటసాయి ఆర్య వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంపల్లి లోని గాంధీ విగ్రహముకు పూలమాల వేసి…