TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం ఆర్ కొత్తూరు గ్రామంలో స్థానిక నాయకులు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్.గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరై తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి , జి సి సి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్. అలాగునే ఆర్. కొత్తూరు గ్రామపంచాయతీ, పెద్ద మల్లవరం గ్రామస్తులు వైసీపీ పార్టీ నుండి, తెలుగుదేశం పార్టీలోకి సుమారు 50 కుటుంబాలు చేరడం జరిగింది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ఎం వి వి ప్రసాద్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారు వేగం కొండబాబు, వేగం తమ్మి నాయుడు,జంపా జోగిరాజు,జంపా దేవుడు, కొనకం దేవుడు, కూడా నాయుడు,జంపకంగా రాజు, కూర గంగరాజు, జంప జోగిరాజు, వేగం అప్పారావు, వేగం చినరాజు బాబు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్. కొత్తూరు సర్పంచ్,ఉప సర్పంచ్ అప్పలనాయుడు, ఆర్ గోవింద్,శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు, మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telugu Desam Party 43rd,