TRINETHRAM NEWS

మందడం : బోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది – తెలుగు వారెక్కడున్నా జన్మభూమికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటాం – సంక్రాంతి పండుగకు మాత్రం మేము నారావారిపల్లె వెళ్తాం – సంక్రాంతి పండుగకు రావాలని పల్లె పిలుస్తోంది – పాత వస్తువులు, పనికిరానివి భోగి మంటల్లో వేయడం సంప్రదాయం – ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు – రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు – చీకటి జీవోలన్నీ భోగి మంటల్లో వేసి తగలబెట్టాం – దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు – వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది – ఇవాళ్టి నుంచి 87 రోజులు వైసీపీకి కౌంట్ డౌన్ – రాజకీయ హింస, అక్రమ కేసులు, మోసపు హామీలను భోగి మంటల్లో వేశాం – పండుగ పూట కూడా అంగన్వాడీలు సమ్మె చేయాల్సిన పరిస్థితి – పేదవాడికి సంపద సృష్టించడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన పనిచేస్తుంది – టీడీపీ-జనసేన అధికారం ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్నారు – ప్రజావేదికతో విధ్వంసానికి జగన్ నాంది పలికారు – జగన్ కు.. ఐదేళ్లలో కూల్చడం తెలుసు.. నిర్మాణం చేతకాదు – చీకటి జీవోలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారు – పేదలకు సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుంచే ప్రారంభం – ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు – ఎన్నికల ముందు జగన్.. అమరావతే రాజధాని అన్నారు – ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నానని జగన్ చెప్పారు – అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నాటకమాడారు – రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించుకోవాలి – రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనది – ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి – మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత