TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌:

తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు..

ఇటీవల ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు..