Students Suffer : కళాశాల ల బంద్ తో విద్యార్థులకు తీవ్ర నష్టం.

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సి ఆర్ పి ప్ వికారాబాద్ జిల్లా.. డిగ్రీ, ఇంజనీరింగ్ ప్రయివేట్ కళాశాలల యాజమాన్యం నిర్వహిస్తున్న బందు వల్ల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెంటనే పీజు రియింబర్స్ మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేయడం జరుగుతుంది..కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం పై ఇతర రూపాలలో నిరసన తెలియజేస్తే బాగుండేదని ఆలా కాకుండా కళాశాల ల బంద్ నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్ట పోతారని వెంటనే కళాశాల లను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం పీజు రియింబర్స్ మెంట్ చేయడం కోసం తెచ్చిన నిబంధనలను వెంటనే రద్దు చేయాలనీ కోరారు.

ఈ నిబంధనల వల్ల పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇదంతా ప్రభుత్వం తప్పించు కోవడంలో భాగంగానే జరుగుతుందని పేదలకు విద్య అనే వరకు ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని చెప్పారు. ఆనవసరమైన వాటికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న ప్రభుత్వం విద్యకు మాత్రం బిక్షం వేసినట్టుగానే ఉందని ఇదే కొనసాగితే తల్లిదండ్రులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉన్నత విద్యను ప్రభుత్వమే ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేస్తున్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Students suffer severe losses

You cannot copy content of this page

Scroll to Top