TRINETHRAM NEWS

పీఎస్ఎల్వీ-సీ58 విజయంపై ఇస్రో చైర్మన్ ను అభినందించిన శ్రీసిటీ ఎండీ

♦️ – శ్రీసిటీని సందర్శించాలని ఆహ్వానం

🔹సోమవారం పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్, షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

🔹 ఈ అద్భుత ఘట్టాన్ని షార్ మిషన్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని వీక్షించిన ఆయన, అంతరిక్ష సాంకేతికతలో అగ్రగ్రామిగా భారతదేశం స్థానాన్ని సుస్థిరం చేస్తూ, ఈ విజయాన్ని అందించిన ఇస్రో బృందం కృషి, అంకితభావాన్ని కొనియాడారు.

🔹ఈ సందర్భంగా శ్రీసిటీ వేగవంతమైన ప్రగతిని వివరిస్తూ, తాజా అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసేందుకు మరియు ఇస్రోకు సహకరిస్తున్న పరిశ్రమల సీఈఓలతో సంభాషించడానికి శ్రీసిటీని సందర్శించాలంటూ డాక్టర్ సోమనాథ్‌ను రవీంద్ర సన్నారెడ్డి ఆహ్వానించారు.