TRINETHRAM NEWS

వార్డులో పర్యటించిన శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ శంభీపూర్ 26వ వార్డులో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ స్థానికులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం వార్డులోని ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…