TRINETHRAM NEWS

శభాష్ బాపట్ల పోలీస్

బాపట్ల జిల్లా

చీరాల మండలం బోయినవారిపాలెం కు చెందిన బోయిన మణికంఠ అనే పదో తరగతి విద్యార్థి మిస్సింగ్ కేసును ఈపూరుపాలెం ఎస్.ఐ జనార్ధన్ 24 గంటల్లో చేధించారు.

ఈనెల 15న మణికంఠ ఇంటి నుండి వెళ్లిపోగా శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన ఎస్ఐ జనార్థన్ అనేక విధాలుగా గాలింపు చర్యలు చేపట్టి ఆ బాలుడు యాజిలి వద్ద ఉన్నట్లు గుర్తించి పట్టుకొచ్చి శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు.