TRINETHRAM NEWS

Professor Jayashankar should be declared the father of Telangana nation

తెలంగాణ తొలిదశ ఉద్యమంలోస్ఫూర్తిదాత

మలిదశ ఉద్యమానికి సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపిత గా రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఛెంగిచర్ల విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి అన్నారు. తేది 6.8.2024 మంగళ వారం రోజున ఆచార్య జయశంకర్ 90 వజయంతి సందర్బంగా చంగిచర్ల ఆర్టీసికాలనీ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన సమావేశంలో ప్రధానకార్యదర్శి కట్టా హరిప్రసాద్ ,ఉపాధ్యక్షులు వి.ఎన్ చారి లు మాట్లాడుతూ సంఘ బలోపేతానికి సమిష్టిగా కృషిచేసి విశ్వకర్మ పంచదాయుల ఆభివృద్ధికి అందరం పాటు పడాలన్నారు.

సమావేశం కంటే ముందు ఆచార్య జ య శంకర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. కార్య క్రమంలో సంఘం కోశాదికారి చెన్నోజు శ్రీనివాసచారి, సంఘం కమిటీ సభ్యులు రవీంద్రచారి, ఆర్.ఉపేంద్రచారి, కె.మహేష్ కుమార్,ఎమ్.లక్ష్మి నారాయణ,మహేష్ చారి,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Professor Jayashankar should be declared the father of Telangana nation