TRINETHRAM NEWS

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్

వేములవాడ, మార్చి 7, 2023:

మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.