Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు!

TRINETHRAM NEWS

పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు!

Trinethram News : అమరావతి: డిసెంబర్ 10
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. చంపే స్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. బెదిరింపు కాల్స్, సందే శాలు వచ్చిన విషయాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. ఆగంతకుడు సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు లబ్బీపేటలో ఉన్నట్లుగా గుర్తించారు.

అయితే, పోలీసులు అక్క డికి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు.పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ గల వ్యక్తి మల్లికా ర్జున రావుగా గుర్తించిన పోలీసులు..

మల్లికార్జున రావు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరువూరుకు చెందిన వైద్య దంపతులకు అతడు బావమరిదిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసై భార్యబిడ్డలకు మల్లికార్జున రావు దూరంగా ఉంటు న్నట్లు పోలీసులు గుర్తిం చారు.

తిరువూరుతోపాటు నెల్లూరులోకూడా మల్లికా ర్జునరావు ఉంటాడని తెలుసుకున్న పోలీసులు .. అక్కడ కూడా గాలిస్తు న్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. డీజీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top