TRINETHRAM NEWS

nujiveedu triple it sickened 800 people

Trinethram News : నూజివీడు

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడు తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది. దీని పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి తక్షణమే మెరుగైన చికిత్సల కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

nujiveedu triple it sickened 800 people