TRINETHRAM NEWS

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం
వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన
ఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్
రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,
పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకు
పాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు 40 మంది
మహిళల వ్యక్తిగత సంభాషణలు విని, వారిని
బ్లాక్మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు గురి
చేసినట్లు వెల్లడైంది.