TRINETHRAM NEWS

నా జీవితం ధన్యమైంది: యూపీ సీఎం యోగి

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.రామ మందిరం కోసం అనేక మంది పౌరులు, సాధుసంతులు పోరాడారు. శతాబ్దాల తర్వాత అయోధ్యకు ఈ రోజు పూర్వవైభవం వచ్చింది. ముందుగా అనుకున్న చోటనే శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాం. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తో నా జీవితం ధన్యమైంది అని యోగి ఆధిత్యనాధ్ చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ దూరదృష్టి, అంకితభావంతో ఈ గొప్ప కార్యం సాకారమైంది. ఇక నుంచి అయోధ్యలో బుల్లెట్ల వర్షం కురవదు. కర్ఫ్యూ ఉండదు. అంతా రామ రాజ్యం ఉంటుంది. సంస్కృతి, అభివృద్ధి నగరంగా అయోధ్య విలసిల్లుతుందని సీఎం యోగి అన్నారు.