TRINETHRAM NEWS

అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 11.12.2023.

తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తను సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని వెల్లడించారు.

కావాలని తనపై ఈ విధంగా కొంతమంది పని కట్టుకుని రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.