TRINETHRAM NEWS

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ అధిష్టానం కృష్ణ ప్రసాద్ కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.

వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.