TRINETHRAM NEWS

అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద ….

ఈరోజు 131-కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ -2 రింగ్ రోడ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 131 డివిజన్ అధ్యక్షులు, గురు స్వామి దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దీక్ష తీసుకోవడంలో ఎంతో పరమార్థం దాగి ఉందని, ఇంద్రియ నిగ్రహంతో పాటు దైవారాధన వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

ఈ మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, బిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కిషన్ రావు, సూర్యప్రభ, 131 డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సురేందర్ రెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, బిజిలి సాంబయ్య, అజయ్, వెంకట్, కల్పన, స్వాములు ఎం. వెంకటరమణ, ఇటికల శ్రీనివాస్, నర్సింగ్ రావు, కోటయ్య, బ్రిజేష్ మిశ్రా, ఏడుకొండలు, భాస్కర్ రాజు, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ జైన్, మల్లారెడ్డి, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.