TRINETHRAM NEWS

TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు..

వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది..