TRINETHRAM NEWS

Jyothula Chanti Babu : టీడీపీ వైపు జ్యోతుల చూపు..టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ నిరాక‌ర‌ణ

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఈ త‌రుణంలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేల‌లో చాలా మందికి టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించారు వైసీపీ బాస్.

ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబుకు టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో జ్యోతుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌న వ‌ద్ద‌కు పిలిపించుకుని చెప్పేశారు జ‌గ‌న్ రెడ్డి.

ఉన్న ప‌ళంగా వైసీపీ బాస్ చంటిబాబు స‌మాలోచ‌న‌లు త‌న వారితో జరుపుతున్నారు. ఈ మేర‌కు తెలుగుదేశం పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా చివ‌ర‌కు బాబు పార్టీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందుకు సంబంధించి వ‌చ్చే నెల జ‌న‌వ‌రి 5న ముహూర్తం నిర్ణ‌యించుకున్నార‌ని , అందుకే ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు ఏర్పాట్లు కూడా ఖ‌రారు చేసుకున్న‌ట్లు టాక్. ఇదే స‌మ‌యంలో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని వారికి , కీల‌క నేత‌ల‌కు త‌మ పార్టీలో చేరేందుకు ద్వారాలు తెరిచే ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో సీటు ద‌క్క‌ని జ్యోతుల టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు.