TRINETHRAM NEWS

దేశంలో గత 24 గంటల్లో మరో 656 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

వీటిలో 128 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడ్డాయి. అక్కడ ఒకరు కరోనాతో చనిపోయారు.

ఇక కర్ణాటకలో 96 మందికి, మహారాష్ట్రలో 35, ఢిల్లీలో 16, తెలంగాణలో 11, గుజరాత్‌లో 10 మందికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడింది.

_దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 3,420 నుంచి 3,742కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.