TRINETHRAM NEWS

ఇందిరమ్మ కాలనీలో పైపులను ఏర్పాటు

మిచాంగ్ తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీని జోరు వానలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటిని బయటికి పంపేందుకు పరిష్కార మార్గం చూపుతానని మాట ఇచ్చిన ఎంపీ, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మూడు రోజులు తిరక్కుండానే మాట నిలబెట్టుకున్నాడు. నీరు బయటకెళ్లేందుకు అడ్డంగా ఉన్న కాలువల పూడికను తొలగించి అవసరమైన ప్రాంతాల్లో పైప్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది.