TRINETHRAM NEWS

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ

తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యారు.

తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురై కిందపడ్డారు.

వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి తరలించారు.

దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.