
Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140 సామాజిక మాధ్యమ ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు యూపీ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
