TRINETHRAM NEWS

ఇద్దరు రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్..

తమిళనాడు..

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకున్నది. మృతులను రఘు, అసన్‌గా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు..

వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు పేర్కొన్నారు..