TRINETHRAM NEWS

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్‌లు స్వాగతం పలికారు.

పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.