TRINETHRAM NEWS

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె..

జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం…

రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె నేటితో ఐదో రోజుకు చేరింది..

సమ్మె విరమణకు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి…

తమకు 26000 జీతం కావాలని అంగన్వాడీ టీచర్లు, 20000 ఇవ్వాలని ఆయాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు…

ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు…

మమ్మల్ని బెదిరించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి…