
Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని పనుల్లో భాగంగా అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయన కార్యాలయ అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంత భాగం భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. తొలుత 27 కి.మీ. మేర ట్రాక్తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
