
Trinethram News : పల్నాడు:ఓటర్ లిస్ట్ అలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ రాజేశ్ను సస్పెండ్ చేశారు. అలాగే మరో ఆరుగురు సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
